Month: March 2024

Slider Telangana

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిన రాష్ట్రంలో ఈ దుస్థితి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు.ఇవాళ జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన.. సూర్యాపేట ప్రెస్‌మీట్‌ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జనగామ జిల్లాలో, కొంతమేరకు బస్సులో ప్రయాణిస్తూ యాదాద్రి జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను మా […]Read More

Slider Telangana

మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌..? నీటిమోతలెందుకు ?- రేవంత్‌ సర్కారు నిలదీసిన కేసీఆర్‌

మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నయ్‌ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్‌ అయ్యాయంటూ రేవంత్‌రెడ్డి సర్కారు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలదీశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు.బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతంగా మారి, ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకొని.. ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి ? దీనికి కారణం ఏంటీ. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ, 15-16 […]Read More

Slider Telangana

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మార్పు..?

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరం మొదలైన సంగతి విధితమే. ఈ నెల పదహారున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి కూడా తెల్సిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పదహారు మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఇప్పటికే ప్రకటించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన బీఆర్ఎస్ నుండి ఇటీవల […]Read More

Slider Telangana

వంశీ కి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర

గుండె పోటుతో మరణించిన కల్లూరు కు చెందిన ప్రముఖ ల్యాబ్ టెక్నీషియన్ కొదమ సింహం వంశీ (38) భౌతిక కాయాన్ని, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, శనివారంచండ్రుపట్ల రోడ్డు బొమ్మరిల్లు టౌన్ షిప్ లో గల వారి నివాస గృహం లో పూల వంశీ బౌతిక కాయాన్ని సండ్ర, వారి అనుచరులు,సందర్శించి వంశీ పార్థివ దేహానికి పూలమాలలు మాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీతో […]Read More

Slider Telangana

పాలేరు రిజర్వాయర్ ను పరిశీలించిన ఎంపీ నామ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఖమ్మం పార్లమెంట్ ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో ఈరోజు ఆదివారం బీఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి బృందం పాలేరు రిజర్వాయర్ను పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ వెంటనే సాగర్ జలాలతో పాలేరు రిజర్వాయర్ ను నింపి, ప్రజల దాహార్తిని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ […]Read More

Slider Telangana

మల్కాజ్ గిరిలో గులాబీ జెండా ఎగరాలి

కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు 125 – గాజుల రామారం డివిజన్ ఆక్సిజన్ పార్కులో వాకర్స్ తో ముచ్చటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని, కనీసం ప్రతి ఒక్కరోజు […]Read More

Andhra Pradesh Slider

ఢిల్లీకి వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ సార్వత్రిక మరియు లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.Read More

Slider Telangana

BRS లోకి చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పరకాల పట్టణంలోని 5వ డివిజన్ కి చెందిన మోరె రాజేందర్ కాంగ్రెస్ పార్టీని వీడి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తిరిగి బి.ఆర్.ఎస్.లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి చల్లా ధర్మారెడ్డి గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన రాజేందర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరి తప్పుచేసానన్నారు.కాంగ్రెస్ పార్టీ విధానాలు,పాలన నచ్చకనే తిరిగి బి.ఆర్.ఎస్ లో […]Read More

Andhra Pradesh Slider

TDP కి షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకపక్క సీట్లు రావడం లేదు అని కొంతమంది ఆ పార్టీకి దూరంగా ఉంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరో పక్క ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించారు. వైజాగ్ జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం లో నిర్వహించిన పార్టీ విస్తృత […]Read More

Slider Telangana

సీఎం రేవంత్ ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి దిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా టీడీపీలో ఉన్నప్పటి నుండి సీఎం రేవంత్ రెడ్డితో ఎంతో సన్నిహితంగా ఉంది. కానీ సీఎం అయిన తర్వాత కలవడానికి అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు . అందుకే సదరు వ్యక్తి హైదరాబాద్ లోని జూబ్లిహీల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. […]Read More