ఆప్ కి బిగ్ షాక్..!

BIG Shock To Aam Aadmi Party Arvind Kejriwal
మరో ఐదు రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
రానున్న ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వలేదని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన వారిలో నరేశ్ యాదవ్, రాజేశ్ రిషి, మదన్ లాల్, రోహిత్, బీఎస్ జూనే, పవన్ శర్మ, భావన గౌర్ ఉన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎన్నికలు జరగనుండగా, 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి
