తెలంగాణలో 1.64కోట్ల మంది బీసీలు..!

తెలంగాణలో 46.25 శాతం బీసీలు (1.64 కోట్ల మంది) ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. కులగణన సర్వే వివరాలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు..
తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో ఎస్సీలు 61.84 లక్షలు (17.43 శాతం)గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఎస్టీలు 37.05 లక్షలు (10.45 శాతం), ముస్లిం బీసీలు 35.76 లక్షలు (10.08 శాతం)గా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఓసీల జనాభా 41.21 లక్షలు (13.31 శాతం)గా ఉందన్నారు.
