వరద బాధితులకు శుభవార్త

 వరద బాధితులకు శుభవార్త

Breaking News

Loading

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలకు గురై సర్వం కోల్పోయిన వరద ముంపు బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇటీవల ఖమ్మం,మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల్లో మృతి చెందిన ఒక్కొక్కర్కి ఐదు లక్షలు ఇస్తాము…

ప్రతి ఇంటికి పది వేలు.. మేక,గొర్రెలు చనిపోతే ఐదారు వేలు.. ఆవు గేదె చనిపోతే యాబై వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ప్రతి ఇంటికిచ్చే పది వేలు సరిపోవు అందుకే పదిహేడు వేలన్నర ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

వీటిలో ఇంటి మరమ్మతులకు రూ.6500, దుస్తులకు రూ.2500, వస్తువులకు రూ.2500,కూలీ కింద రూ. 6000లు మొత్తం కలిపి రూ.17500లు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సాయం పై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *