తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు

 తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు

Loading

“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు.

ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగురేఖలను ఇనుమడింపచేయాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని వెలుగుల పండగను సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *