సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మార్పు..?

 సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  మార్పు..?

Telangana Congress

Loading

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరం మొదలైన సంగతి విధితమే. ఈ నెల పదహారున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి కూడా తెల్సిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పదహారు మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది.

మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతుంది. అయితే ఇప్పటికే ప్రకటించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన బీఆర్ఎస్ నుండి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ను మార్చే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి.

తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీగా అవకాశమిస్తామని తెగేసి చెప్పడంతో దానం దానికి నో అన్నట్లు ఆ వార్తల సారాంశం. దీంతో ఎంపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని గాంధీభవన్ వర్గాల టాక్.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *