లక్ష్మీ పార్వతిని వేధిస్తున్న తెలుగు తమ్ముళ్ళు…!

ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు సతీమణి.. వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ లో ఆయనకు ఘననివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ” టీడీపీ వాళ్లు నన్ను మానసికంగా చాలా వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్ నంబర్ ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అప్పటి నుండి టీడీపీ వాళ్ల నుండి వచ్చే కాల్స్ .. మెసేజ్స్ భయంకరంగా ఉంటున్నాయి.
నన్ను అనుమానిస్తుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటున్నారు. ఆయన ఖండించరా..?. నేను ఎన్టీఆర్ భార్యనే కదా.. నేనేమి తప్పు చేశానని ఆమె తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
