నేడే మూడో టీ20..!

భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా మరోవైపు 5 టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లను గెలుపొంది.
వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది.
మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.
