పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి

 పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి

Loading

ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబద్రుల ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బ్యాలెట్ పేపర్ లోని మూడో నెంబర్ క్రమ సంఖ్యలో మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు తెలిపారు. 

గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రున్ని కలుసుకొని ఓట్లను అభ్యర్థించాలని, బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. శాసనమండలిలో పట్టబద్రుల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయగల సామర్థ్యం ఉన్న రాకేష్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమానికి ముందుగా నియోజకవర్గం నాయకులంతా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు గారి మరణం పట్ల మౌనం పాటించి సంతాపం తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *